Leading News Portal in Telugu

CM Chandrababu: విద్యార్థినిపై దాడి కలచివేసింది.. కడప ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు


  • కడప ఘటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
  • ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిపై దాడి కలచివేసింది
  • ఒక దుర్మార్గుడి‌ దుశ్చర్యకు బలి కావడం విచారకరం
  • విచారణ వేగవంతం చేసి శిక్ష పడేలా చేయాలని ఆదేశించిన సీఎం
CM Chandrababu: విద్యార్థినిపై దాడి కలచివేసింది..  కడప ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరమని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారని ఆయన వెల్లడించారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే…. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమేనన్నారు. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించానన్నారు.