lucknow accident averted due to wisdom of dal loco payal who got stuck in engine of bareilly varanasi express train

Uttarpradesh : దేశంలోని నలుమూలల నుంచి రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలు రోజురోజుకూ బయటకు వస్తున్నాయి. కొన్నిసార్లు రైల్వే ట్రాక్పై సిలిండర్లు, కొన్నిసార్లు ఫిష్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. దీని కోసం, ట్రాక్పై పెద్ద చెట్ల కొమ్మలు, చిన్న రాళ్లను ఉంచారు. బరేలీ నుంచి వారణాసి వెళ్తున్న రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రాక్పై ఉంచిన చెట్టు కొమ్మ ఇంజిన్లో ఇరుక్కుపోయింది. దీంతో రైలు యాక్సిల్ కౌంటర్ విరిగిపోయింది. మలిహాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజన్లో చెట్టు కొమ్మ ఇరుక్కుపోవడంతో వెంటనే రైలును ఆపేశాడు. అనంతరం ఈ విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేశాడు. దీనిపై సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రైల్వే పాత్ మలిహాబాద్ అజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలన
రైల్వే ట్రాక్పై చెట్టు కొమ్మలు, రాయిని ఎవరు తీసుకొచ్చారో తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల ఒకదాని తర్వాత ఒకటి రైల్వే ఉద్యోగులకు సవాళ్లు కూడా ఎక్కువయ్యాయి. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అజయ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రాక్పై కొమ్మలు, రాళ్లు వేయడం వల్ల బరేలీ, వారణాసి వెళ్తున్న రైలు ఇంజన్లో ఇరుక్కుపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ట్రాక్పై అమర్చిన సిగ్నల్ పరికరం కూడా బాగా దెబ్బతింది.
రైళ్ల రాకపోకలపై ప్రభావం
ఇంజన్లో చెట్టు కొమ్మ ఇరుక్కుపోవడంతో లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశాడు. ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు, ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. ప్రస్తుతం సిగ్నల్ పరికరం పాడైపోవడంతో ఈ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. త్వరలో సరిచేసేందుకు రైల్వే ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు.