Leading News Portal in Telugu

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Oct 29, 2024 8:59AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (అక్టోబర్ 28)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డెరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం (అక్టోబర్ 28) శ్రీవారిని మొత్తం 63 వేల 729 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 967 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 85 లక్షల రూపాయలు వచ్చింది.