Leading News Portal in Telugu

కేరళ వెళ్లనున్న రేవంత్ రెడ్డి  | Revanth Reddy is going to Kerala


posted on Nov 2, 2024 12:43PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సాయంత్రం కేరళ బయలు వెళ్లనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తరపున ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట  మంత్రి శ్రీధర్ బాబు కేరళ వెళ్లనున్నారు. కేరళలో కాంగ్రెస్ రెండో దశ ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం  అంటే ఈ నెల మూడో తేదీన రాహుల్ గాంధీ కేరళ వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కేరళ వాయనాడ్, రాయ్ బరేలీ నుంచి  గెలిచిన రాహుల్   వాయనాడ్ లోకసభకు రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ చెల్లెలైన ప్రియాంకకు వాయ నాడ్  టికెట్ కాంగ్రెస్ కేటాయించింది.