Leading News Portal in Telugu

In India vs New Zealand 3rd Test match second innings india lost early 5 wickets for 29 runs


  • భారత్ – న్యూజిలాండ్ మధ్య టెస్టు.
  • పీకల్లోతు కష్టాల్లో భారత్..
  • 29 పరుగులకే 5 వికెట్లు.
IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు

India vs New Zealand 3rd Test: భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. మూడో రోజు రోజు ఆటను మొదలు పెట్టిన న్యూజిలాండ్ 3 పరుగులు చేసి 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దాంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 5 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. దింతో ప్రస్తుతం సంగం టీం పెవిలియన్ కు చేరినట్లయింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ 5 పరుగులు, రోహిత్ శర్మ 11, శుభమన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 174 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. అంటే తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. ప్రస్తుత మ్యాచ్ ను చూస్తే అది అయ్యేలా లేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే విషయంలో కూడా ఈ మ్యాచ్ భారత్‌కు చాలా ముఖ్యమైనది.