Leading News Portal in Telugu

ముఖ్యమంత్రి బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లపై రగడ


posted on Nov 12, 2024 10:51AM

అమృత్ టెండర్లను రద్దు చేసి విచారణ చేపట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కెటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గత సెప్టెంబర్ లో ఇదే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్  మరోమారు ఫిర్యాదు చేసినట్లు  కెటీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత బావమరిదికి సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.  అమృత్ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో 15వందల కోట్ల నిధులు ముఖ్యమంత్రి బామ్మర్దులకు కేటాయించడం శోచనీయమన్నారు.  వారికి ఎలాంటి అర్హత లేనప్పటికీ అమృత్ టెండర్లు అప్పగించడం వెనక భారీ  అవినీతి జరిగిందని కెటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి మధ్య ఎటువంటి సంబంధం లేకుంటే వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.