posted on Feb 1, 2025 5:23PM
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీ వెయిట్ లిఫ్టర్లు తమ సత్తా చాటారు. పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో రాష్ట్రానికి చెందిన కె. నీలం రాజు స్వర్ణ పతకం సాధించగా… నేడు మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్. పల్లవి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ గెలుపుపై ముఖ్యమంత్రి స్పందించారు. కంగ్రాచులేషన్ పల్లవి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.