- మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపమందు ప్రసాదం పంపిణీ
- ఈ ఏడాది కూడా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
- అసులు మృగశిర కర్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారు
- ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం..

ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారు..? అనే ప్రశ్న అందరి మదిలో ఉంటుంది. దీనికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: 8 Vasantalu : ‘8 వసంతాలు’ నుంచి హార్ట్ టచింగ్ సెకండ్ టీజర్ రిలీజ్..
మృగశిర కార్తె ప్రవేశించిన సమయంలో ఎండా తగ్గుతాయి. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభమవుతాయి. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడి కోసం చేపలను ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. వాతావరణం మారటంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో.. జనాల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజులపాటు హైదరాబాద్లో చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు రెండు మూడు రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. అయితే మృగశిర కార్తె ప్రారంభమైన రోజునే.. చేప ప్రసాదం ఇస్తే బాధితులకు సరిగ్గా పని చేస్తుందని నమ్మకం. మరోవైపు.. మృగశిర కార్తె ప్రారంభమైన ఒక్కరోజే కాకుండా మిగతా రోజుల్లోనూ జనాలు చేపలు ఎక్కువగా తింటుంటారు.
READ MORE: Sangareddy: అన్న ఫ్రెండ్ తో వెళ్లిపోయిన చెల్లి.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు