Leading News Portal in Telugu

JioBharat Safety First 4G Phone Launched at Rs. 799 with Safety Shield, 7-Day Battery, Real-Time Tracking


JioBharat safety first 4G: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025లో రిలయన్స్ జియో ‘జియోభారత్’ ఫోన్‌ల కోసం కొత్త సేఫ్టీ-ఫస్ట్ (safety first) సామర్థ్యాన్ని తీసుకవచ్చింది. ఇది మీ సమ్బన్ధితగా వ్యక్తులతో కమ్యూనికేషన్‌ను మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా చేయడానికి రూపొందించబడింది. ఈ ఫీచర్ జియో సరసమైన 4G ఫోన్ ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్ కనెక్టివిటీ, డిజిటల్ కేర్‌ను కలిపి కుటుంబంలోని వ్యక్తులు కనెక్ట్ అయ్యేలా, వారు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

Bhatti Vikramarka : దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం.. డిప్యూటీ సీఎం ఆదేశాలు

జియోభారత్ సేఫ్టీ-ఫస్ట్ సొల్యూషన్ ఫీచర్ ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు, ఆధారపడిన వారికి దగ్గరగా ఉండటానికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. జియో ఈ సేఫ్టీ సూట్‌ను “సేఫ్టీ షీల్డ్” అని పేర్కొంది. ఈ ఫోన్ ద్వారా.. మీకు సంబంధిత వ్యక్తి లొకేషన్ గురించి రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. కనెక్టివిటీని నిర్ధారించడానికి బ్యాటరీ స్థాయి, నెట్‌వర్క్ గురించి కూడా వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఎప్పుడైనా, ఎక్కడైనా అంతరాయం లేని యాక్సెస్‌ను నిర్ధారిస్తుంది.

IAF: “రావల్పిండి చికెన్ టిక్కా, బలవల్పూర్ నాన్”.. డిన్నర్ మెనూతో పాకిస్తాన్ పరువు పోయిందిగా..

జియోభారత్ సేఫ్టీ-ఫస్ట్ ఫోన్‌ల ధర రూ. 799 మాత్రమే. ఇవి జియో స్టోర్స్, ప్రముఖ మొబైల్ రిటైలర్లు, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ IMC 2025లో బ్లూ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.