Leading News Portal in Telugu

బీచ్‌లో మునిగి ఏపీలో ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లు.. వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని బలి తీసుకున్నాయి. ఆదివారం విశాఖపట్నంలోని ముత్యాలమ్మ బీచ్‌లో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతదేహలు లభ్యం కాగా, మరొకరు గల్లంతయ్యారు. మృతిచెందిన యువకులు వెన్నెలపాలెంకు చెందిన రామకృష్ణ నరేష్, మహేష్‌లుగా గుర్తించారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్‌కు వెళ్లిన ప్రేమ్ జీ అనే యువకుడు సముద్రంలో స్నానానికి దిగి మృతిచెందాడు. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ బీచ్‌కు వెళ్లిన సురంపాలెం ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన ఇద్దరు నైజీరియన్ ఇంజనీరింగ్‌ విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.