వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి: వెంకయ్య
పుణె: రైతులకు రుణమాఫీ పరిష్కారం కాదని.. దీర్ఘకాలంలో అది వ్యవసాయ రంగం, బాధిత రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. వారి ఆదాయాన్ని పెంచడం చాలా అవసరమన్నారు.
సంప్రదాయ వ్యవసాయంతో పాటు పౌలీ్ట్ర, పాడి, మత్య్స పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ రంగాల దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల అన్నదాతలు కావాల్సినంత ఆదాయాన్ని పొందుతారని.. తద్వారా ఆత్మహత్యలు చేసుకోరని అభిప్రాయపడ్డారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఎలా’ అనే అంశంపై పుణెలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు అనుకూల విధానాలను తేవాలన్నారు.