ఏప్రిల్ చివరి నుంచి కరోనా కేసుల్లో తగ్గుదల… చైనా శాస్త్రవేత్త అంచనా…
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్… ఏప్రిల్ చివరికల్లా… రివర్స్ అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే… ఈ వైరస్ మొదలైన చైనాలో కేసుల సంఖ్యకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఇటలీలో కేసుల సంఖ్యలో పెరుగుదల తగ్గింది. ఇటలీ తర్వాత వ్యాపించిన అమెరికాలో… ఇప్పుడు కేసులు పెరుగుతుంటే… మరికొన్ని రోజుల్లో వాటి పెరుగుదలలో తగ్గుదల మొదలవుతుంది. అమెరికా తర్వాత కరోనా వ్యాపించిన ఇండియాలో ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ… ఏప్రిల్ చివరికల్లా… అవి కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కాస్త అటూ ఇటుగా నెలాఖరుకల్లా కొవిడ్-19 కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు చైనాలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఝాంగ్ నన్షాన్ (Zhong Nanshan).
కరోనా వైరస్ నానాటికీ బలహీనం అవుతోందంటున్న నన్షాన్… చైనాలో ఈ వైరస్ మళ్లీ పెరిగే అవకాశమే ఉండదని… చైనాలోని ఓ టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రపంచ దేశాలు చేపట్టిన లాక్డౌన్ అనేది అత్యంత ప్రభావ వంతంగా పనిచేసిందనీ… అది వైరస్ వ్యాప్తిని చాలా వరకూ తగ్గించేసిందని ఆయన చెబుతున్నారు. అంతేకాదు… నానాటికీ వైరస్కి సంబంధించిన ఎన్నో విషయాలూ, రహస్యాలూ మనకు తెలిసిపోతున్నాయనీ, అందువల్ల దాన్ని ఎదిరించే మందుల తయారీపై మనం పై చేయి సాధిస్తున్నామని నన్షాన్ తెలిపారు. ఈ పరిస్థితులన్నీ కలిసి… మే నుంచీ కోరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతూ… త్వరలోనే వైరస్ పూర్తిగా పోయే రోజులు చూస్తామని ఆయన అన్నారు.
ఒకసారి వైరస్ సోకిన వ్యక్తికి నయమైన తర్వాత… మళ్లీ ఆ వ్యక్తికి వైరస్ సోకే అవకాశాలు కూడా… నెల తర్వాత పూర్తిగా తగ్గిపోతాయని నన్షాన్ ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాలోని వుహాన్లో… ఒకసారి నయమై… తిరిగి పాటిజివ్ వచ్చిన కేసులు అత్యంత అరుదుగా (Very Rare)గా నమోదయ్యాయని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నయమైన తర్వాత… శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయన్న ఆయన… అవి తిరిగి