Leading News Portal in Telugu

Corona Lockdown : ఏపీ, తెలంగాణలో సెర్చ్ ఆపరేషన్… ఆ అనుమానితులు ఎక్కడ?

సభలకు వెళ్లి… తిరిగి ఏపీ తెలంగాణలోని వేర్వేరు జిల్లాలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కొంత మందిని గుర్తించిన ఏపీ, తెలంగాణ పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం 11 మంది అనుమానితుల్ని అధికారులు గుర్తించారు. వారికి కరోనా ఉందో, లేదో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం వారి శాంపిల్స్ తీసుకొని… పరీక్షలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఫలితాలొస్తాయి.

ఇటీవల జమాత్‌కి వెళ్లి వచ్చిన గుంటూరు, ప్రకాశం జిల్లాల వారిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాంతో రెండు రాష్ట్రాల అధికారులూ అప్రమత్తం అయ్యారు. పాజిటివ్‌గా తేలిన వారి కుటుంబాల్లో 150 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరుకి చెందిన ఐదుగుర్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అలాగే విజయనగరం జిల్లాలో 12 మందిని ఐసోలేషన్‌కి తరలించారు. రాజమండ్రిలో 21 మందిని ఐసోలేషన్ వార్డులకు పంపారు.

మత ప్రార్ధనల కోసం ఢిల్లీకి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 40 మంది వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 25 మందిపై అనుమానం ఉండటంతో… క్వారంటైన్‌ను తరలించారు. నిజామాబాద్ జిల్లాలో మొన్ననే తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ వ్యక్తితోనే కలిసి అనుమానితులు ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లినట్లు తెలిసింది.