లాక్డౌన్పై ఎత్తేసేందుకు రెడీగా ఉన్న కర్ణాటక… సీఎం కీలక వ్యాఖ్యలు
ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై కర్ణాటక సీఎం యడియూరప్ప మాత్రం భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లో 12 జిల్లాల్లో కరోనా కేసులు లేవు. దీంతో ఈ జిల్ల్లాల్లో లాక్ డౌన్ ఎత్తివేసే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉంది. దీనిపై కేంద్రంతో సంప్రదించిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం యడియూరప్ప బుధవారం తెలిపారు. ఇప్పటివరకు కర్ణాటకలో 181 కేసులు నమోదు కాగా… వీటిలో ఐదుగురు చనిపోయారు. 28 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు.
ఒకవేళ ప్రధానమంత్రి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంటే… తమ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తి వేయాలని సీఎం యడియూరప్ప ఉన్నారు. ఒకవేళ ఈ జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తి వేసినా… వారు ఒక జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశం ఉండదని ఆయన అన్నారు. కాగా… దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉంది.