Leading News Portal in Telugu

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత… కేసీఆర్ సంతాపం

కుమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఈ రోజు ఇంట్లో ఒక్కసారిగా కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రి కి తరలించారు. సమ్మయ్య మొదట కాంగ్రెస్ పార్టీ లో పనిచేశారు. ఒక పర్యాయం కావేటి సమ్మయ్య సతీమణి కావేటి సాయిలీల కాగజ్ నగర్ పురపాలక సంఘం చైర్ పర్సన్ గా చేశారు. అనంతరం కావేటి సమ్మయ్య 2007 సంవత్సరం కాగజ్ నగర్ పట్టణం ఎస్పీఎం గ్రౌండ్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. మొదట 2009 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. తర్వాత మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2011 సంవత్సరంలో గెలుపొందారు. తిరిగి 2018 సంవత్సరం ఎమ్మెల్యే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావేటి సమ్మయ్యకు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. కావేటి సమ్మయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.