Leading News Portal in Telugu

వారిని సస్పెండ్ చేస్తే… మరి ఆ తప్పు చేసిన జగన్‌కు ఏ శిక్ష వేయాలి?: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు సరైన వైద్య పరికరాలే లేవంటూ ఆరోపించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వం వేటు వేయడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ తప్పు పట్టారు. ప్రభుత్వం వద్ద సరైన మాస్క్‌లు లేవంటూ ఆరోపించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ప్రభుత్వం నుంచి తమకు కనీసం రూపాయి నిధులు కూడా రాలేదన్నారు. అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే తమను ఆదుకుంటున్నారని చెప్పారు. దీంతో ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ ఆయన్ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా నగరి వదిలి వెళ్లకూడదని చెప్పింది. ఈ ఇద్దరినీ సస్పెండ్ చేయడాన్ని తప్పుపట్టిన నారా లోకేష్, వెంటనే ఆ ఇద్దరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.