భారత్కు చేతులెత్తి దండం పెడుతున్నా…సాయం చేయండి..షోయబ్ అఖ్తర్ సంచలన వీడియో…
కరోనాతో పాకిస్థాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ కు, కరోనాతో పెద్ద గండం వచ్చిపడింది. అయితే ఈ గండం నుంచి బయటపడేందుకు భారత్ పెద్ద మనసుతో ముందుకు రావాలని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తన తాజా వీడియోలో అభ్యర్థించాడు. తమ దేశంలో కరోనా వైరస్ని నియంత్రించడానికి భారత్ సాయం చేయాలంటూ అక్తర్ విన్నవించాడు. కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు లేవని, ఈ విషయంలో తమను భారత్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
తమకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం ఉందని, అవి లేకపోవడం వల్ల పాక్ లో మరణాల రేటు ఎక్కువగా ఉందని అఖ్తర్ వాపోయాడు. ఈ విషయంలో సాయం చేయడానికి భారత్ ముందుకు రావాలి. విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో తమకు సాయం చేయాలని అభ్యర్థించాడు. కరోనా విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలని అక్తర్ కోరాడు. పాకిస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.