Exams:విద్యార్థులారా అలర్ట్.. ప్రవేశపరీక్షలన్నీ వాయిదా.. తిరిగి ఎప్పుడంటే.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని బందయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి మే నెలలోనే దాదాపు సగానికి పైగా ప్రవేశ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా ఎంసెట్తో సహా మిగిలిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఈ మేరకు ప్రకటించారు. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల గడువు మే 5వ తేదీ వరకు ఉన్నట్టు పాపిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇప్పటికే ఎంసెట్ సహా మిగతా అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.