Leading News Portal in Telugu

సారీ చెప్పిన ఎన్నారై యాంకర్ స్వాతి… అమెరికాలో కేసు నమోదు…

ఎన్నారై యాంకర్ స్వాతి దేవినేని వివాదాస్పద వ్యాఖ్యల దుమారంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారైల నుంచీ తీవ్ర అభ్యంతరం రావడంతో… తాజాగా ఆమె సారీ చెప్పారు. మరోవైపు ఆమె వ్యాఖ్యలపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటాన్ని ఇండియాలో కరోనా వైరస్ కేసులతో పోల్చుతూ… స్వాతి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో అమెరికా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోతోందనీ, భారత ప్రభుత్వం మాత్రం చక్కగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారైలు అభ్యంతరం తెలిపారు. భారతీయురాలిగా భారత్‌ను మెచ్చుకుంటే తప్పులేదుగానీ… అందుకోసం అమెరికాను నిందించడం కరెక్టు కాదంటూ… ఎన్నారైలు ఫైర్ అయ్యారు. దాంతో స్వాతి వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలకు బాధ్యతగా తాను సారీ చెబుతున్నానని అన్నారు. ఓ యూట్యూబర్ కోరిన స్క్రిఫ్టును తాను చెప్పాననీ, అందులోంచీ కొంత భాగం లీకై… సోషల్ మీడియాలోకి వచ్చిందని స్వాతి తెలిపారు.

మరోవైపు స్వాతిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. శ్రవణ్ అనే తెలుగు ఎన్నారై… న్యూయార్క్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కంప్లైంట్ ఇచ్చారు… ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. అమెరికాలో ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా… స్వాతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. అందువల్ల ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యల వివాదం కోర్టుకు చేరినట్లైంది.