Leading News Portal in Telugu

ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి…

ఉస్మానియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పీజీ డాక్టర్లపై దాడి జరిగింది. కరోనా అనుమానితులు ఉన్న ఐసోలేషన్ వార్డులోని కొందరు… విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఐసోలేషన్ వార్డులో ఇద్దరి అనుమానితులకు కరోనా పాజిటివ్ రావడంతో… తమను కూడా వారితోనే ఉంచడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై డాక్టర్లతో గొడవ పడిన పలువురు కరోనా అనుమానితులు… వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. తమను కరోనా పేషెంట్లపై మధ్య ఎందుకు పెట్టారని… వాళ్లు ఆరోపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తమపై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్‌కు పీజీ డాక్టర్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై ఆస్పత్రి వర్గాలు స్పందించాల్సి ఉంది.

గతంలో గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పేషెంట్లకు వైద్య సాయం అందిస్తున్న వైద్య సిబ్బందిపై పలువురు పేషెంట్లు, వారి బంధువులు దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గాంధీ ఆస్పత్రిలో భద్రతను పెంచింది.