కరోనా విలయతాండవంక్రైమ్ట్రెండింగ్బిజినెస్బిజినెస్ ఐడియాఅంతర్జాతీయంఆరోగ్యంటెక్నాలజీWin 1 Lakh – MC PRO Contest హోమ్ » న్యూస్ » క్రీడలు IPL 2020: ఐపీఎల్ నిలిపివేత…బీసీసీఐ కీలక నిర్ణయం
కరోనా విజృంభణ, లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఐపీఎల్-2020 నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను తదుపరి ప్రకటన వరకు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటన విడుదల చేశారు. కోవిడ్-19 మహమ్మారిపై యావత్ ప్రపంచంలో ఆందోళన నెలకొనడం, మే 3 వరకు భారత ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో ఐపీఎల్-2020ని తదుపరి ప్రకటన వరకు నిలివేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాతే మ్యాచ్లను నిర్వహిస్తామని.. ఈ విషయాన్ని ఇప్పటికే ఫ్రాంచైజీ ఓనర్లు, బ్రాడ్కాస్టర్స్, స్పాన్సర్స్కి తెలియజేసినట్లు తెలిపారు.