తెలంగాణలో ఇవాళ 50 పాజిటివ్ కేసులు.. మంత్రి ఈటల ప్రకటన
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఒక్క రోజే 50 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వీటిలో 90శాతం కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇవాళ కరోనాతో ఎవరూ చనిపోలేదని చెప్పారు ఈటల. మరో 68 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని.. వారందరినీ డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవాళ్టి కేసులను కలుపుకుంటే తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 700కు చేరినట్లయింది. దీనిపై తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.