Leading News Portal in Telugu

కృష్ణా జిల్లాలో సరుకుల కొత్త రేట్లు ప్రకటించిన ప్రభుత్వం…

కృష్ణా జిల్లాలో నిత్యావసరాల రేట్లను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి కొత్తగా ధరలు అమల్లోకి రానున్నాయి. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మినపగుళ్లు, శెనగపప్పు, గోధుమపిండి, గోధుమ రవ్వ, పంచదార, పామాయిల్, సర్ ఫ్లవర్ ఆయిల్, వేరు శనగనూనె ధరలు జిల్లాలో ఎంత ఉండాలో నిర్ణయిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం సూచించిన ధరల పట్టికను ఆయా కిరాణా దుకాణాల వద్ద ప్రజలకు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.