Leading News Portal in Telugu

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు…

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తనదైన శైలిలో స్పందించారు. విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియంపై చాలా ఆసక్తి ఉందని… అందుకే ప్రభుత్వ స్కూల్స్‌లో డ్రాపవుట్స్ చాలా తగ్గాయని ఆయన అన్నారు. అన్ని స్కూల్స్ లో తల్లిదండ్రుల కమిటీలు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని తీర్మానాలు చేసి పంపించారని స్పీకర్ తమ్మినేని గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించడం ఎంతవరకు సబబు అని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియం అంశంపై తీర్పు ఇచ్చిన న్యాయాధిపతి పిల్లలు ఎక్కడ చదవించారని తమ్మినేని ప్రశ్నించారు.

కోర్టులో వాదోపవాదాలు, జడ్జిమెంట్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఇస్తారని గుర్తు చేశారు. మన పిల్లలు పెద్ద స్కూల్స్‌లో చదవచ్చు కానీ… పేదవారి పిల్లలను వెనకబడిన వర్గాల పిల్లలను దళిత,నిమ్న,మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీషులో చదువుకోకూడదా అని ప్రశ్నించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూతపడినప్పటికి కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఇంగ్లీషు బోధననైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారని తమ్మినేని అన్నారు.