కరోనా వైరస్ చైనా వుహాన్ ల్యాబ్లోనే తయారైంది : నోబెల్ గ్రహీత
వుహాన్ నగరంలో… వైరస్లపై ప్రయోగాలు చేసే మూడు ల్యాబ్లు ఉన్నాయి. వాటిలో ఒక ల్యాబ్… వెట్ మార్కెట్ (వన్యప్రాణులు అమ్మే మార్కెట్) దగ్గర్లోనే ఉంటుంది. ఆ ల్యాబ్లో కరోనా వైరస్ని స్వయంగా మనుషులే తయారుచేశారనే ఆరోపణలు… నాలుగు నెలలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఫాక్స్ న్యూస్ కూడా… ఈ వాదనను బలపరుస్తూ… చైనాకి వ్యతిరేకంగా వార్త ఇచ్చింది. ఆల్రెడీ అమెరికా… చైనాపై రెగ్యులర్గా ఈ ఆరోపణ చేస్తూనే ఉంది. తాజాగా… ఫ్రాన్స్ వైరాలజిస్ట్ (వైరస్పై పరిశోధన చేసే శాస్త్రవేత్త), మెడిసిన్లో నోబెల్ అవార్డ్ పొందిన ల్యుక్ మొంటాగ్నియర్ (Luc Montagnier)… కరోనా వైరస్ (SARS-CoV-2) అనేది మనుషులు సృష్టించిందేననీ,… చైనాలోని వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు… జరిగిన ప్రమాదంలో… ఈ కొత్త వైరస్ పుట్టిందని ఆయన అన్నారు. ఈ ల్యాబ్… 2000 సంవత్సరం నుంచి ఇలాంటి వైరస్లపై పరిశోధనలు చేస్తోంది.
ఫ్రాన్స్కి చెందిన ఓ న్యూస్ ఛానెల్… ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే… మొంటాగ్నియర్ ఈ బాంబు పేల్చారు. ఆయన ఇలా ఎందుకు అన్నారో మనం తెలుసుకుందాం. ఈ మొంటాగ్నియర్, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి… ఎయిడ్స్ వైరస్ని గుర్తించారు. అందుకోసం వీళ్లు ముగ్గురికీ 2008లో మెడిసిన్లో నోబెల్ అవార్డ్ వచ్చింది. సో… ఈ మొంటాగ్నియర్కి ఎయిడ్స్ వైరస్ ఎలా ఉంటుందో… అందులో ఉండే జన్యువులు ఏంటో పూర్తిగా తెలుసు.
మొంటాగ్నియర్ ఏమన్నారంటే… కరోనా వైరస్ జన్యువుల్లో… ఎయిడ్స్ (హ్యూమన్ ఇమ్యునో వైరస్ – HIV) మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు తెలిపారు. అందువల్లే ఈ వైరస్ సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదని ఆయన అన్నారు.