వైన్ షాపులపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. ఇంతకీ ఏమన్నాడంటే..
రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ఎపుడు ఎవరిపై దేని కోసం ట్వీట్ చేస్తాడో చెప్పడం కాస్త కష్టమే. తాజాగా ఈ దర్శకుడు కరోనా కారణంగా ప్రభుత్వం దాదాపు అత్యవసరాలు తప్పించి మిగతా వాటిపై లాక్డౌన్ ప్రకటించాయి. అందులో మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం అందించే వైన్ షాపులు మూత పడటంతో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆదాయాలకు గండిపడింది.కేవలం లిక్కర్ ద్వారానే కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తోంది. ఈ రూట్లోనే మహారాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడం కోసం పరిమితులతో కూడిన మద్యం షాపులను తెరవాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా దీనిపై వివాదాస్పద దర్శకుడు వర్మ మాట్లాడుతూ.. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా జరిగే అనర్ధాలపై ట్వీట్ చేశాడు. ప్రజలు కోరుకునే వాటిని పరిమితం చేస్తే.. వేరే వాళ్లు దాన్ని బ్లాక్ మార్కెట్ చేసే అవకాశాలున్నాయి. దీని వల్ల ప్రజలు తమకు అవసరమైన ఆల్కహాల్ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగిస్తారు. దాంతో కుటుంబ అవసరాలను ప్రజలు కోల్పోవాల్సి వస్తోందని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.
మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ఒక ఫోటోను చూపిస్తూ…2019లో ప్రజలు రెస్టారెంట్లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసాడు. మొత్తానికి వర్మ ట్వీట్ చేసిన ఈ రెండు ట్వీట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.