Leading News Portal in Telugu

కరోనా బాధితుల కోసం ఆమె చేసిన పనికి కన్నీళ్లు ఆగవు…ఏం చేసిందంటే…

కరోనాతో వీఐపీల గుండెల్లో భయం పుట్టించిన సింగర్ కనికా కపూర్ ప్రస్తుతం జబ్బు నుంచి కోలుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా చికిత్సలో భాగంగా కోవిడ్ -19 రోగులకు సహాయం చేయడానికి ప్లాస్మాను దానం చేయడానికి కనికా కపూర్ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీని సంప్రదించారు. ప్లాస్మా థెరపీ ద్వారా వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను సేకరించి బాధితులకు ఎక్కిస్తారు. అందులోని యాంటీ బాడీస్‌ బాధితుడి రక్తంలోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటాయి. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్లాస్మా థెరపీనే ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఈ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఇటీవల కరోనా బారిన పడిన బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ కోలుకొని కొద్దిరోజుల క్రితం డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే.