దేశంలో 30 వేలకు చేరువైన కరోనా కేసులు… గడిచిన 24 గంటల్లో…
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1543 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,235కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 684 మంది పేషెంట్లు ఈ వైరస్ నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 23.3గా ఉందని వివరించారు. ఇది ఎంతో మెరుగైన రికవరీ రేటు అని తెలిపారు. దేశంలోని మరో 17 జిల్లాల్లో గత 28 రోజుల నుంచి కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.