Leading News Portal in Telugu

Manipur Violence: మణిపుర్‌లో ఇంకా చల్లారని హింస.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన కేంద్రం – Telugu News | Centre security boost as fresh violence erupts in manipur


Aravind B |

Updated on: Aug 06, 2023 | 9:36 PM

మణిపుర్‌లో ఇంకా అల్లర్లు చల్లారలేవు. మళ్లీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా 10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద మణిపుర్‌కు తరలించింది. శనివారం రోజున బిష్ణుపుర్ జిల్లాలోని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్వాక్టా అనే ప్రాంతానికి చెందిన మెయిటీలుగా గుర్తించారు.

Aug 06, 2023 | 9:36 PM

మణిపుర్‌లో ఇంకా అల్లర్లు చల్లారలేవు. మళ్లీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా 10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద మణిపుర్‌కు తరలించింది.

మణిపుర్‌లో ఇంకా అల్లర్లు చల్లారలేవు. మళ్లీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా 10 కంపెనీల బలగాలను ఆగమేఘాల మీద మణిపుర్‌కు తరలించింది.

శనివారం రోజున బిష్ణుపుర్ జిల్లాలోని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్వాక్టా అనే ప్రాంతానికి చెందిన మెయిటీలుగా గుర్తించారు.

శనివారం రోజున బిష్ణుపుర్ జిల్లాలోని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్వాక్టా అనే ప్రాంతానికి చెందిన మెయిటీలుగా గుర్తించారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో మెయిటీ వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పులు పెట్టేశారు. అయితే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం అదనపు బలగాలను మోహరించింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో మెయిటీ వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పులు పెట్టేశారు. అయితే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం అదనపు బలగాలను మోహరించింది.

మే 3 న మెయిటీ, కుకీల మధ్య తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హింసాత్మక ఘటనలు మరింత పెరగడంతో కేంద్రం దాదాపు 40 వేల మంది ఆర్మీ, పారమిలటరీ దళాలను అలాగే కేంద్ర సాయుధ బలగాలను మణిపుర్‌లో రంగలంకి దించింది. అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినప్పటికీ.. హింస మాత్రం తగ్గింది.

మే 3 న మెయిటీ, కుకీల మధ్య తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హింసాత్మక ఘటనలు మరింత పెరగడంతో కేంద్రం దాదాపు 40 వేల మంది ఆర్మీ, పారమిలటరీ దళాలను అలాగే కేంద్ర సాయుధ బలగాలను మణిపుర్‌లో రంగలంకి దించింది. అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినప్పటికీ.. హింస మాత్రం తగ్గింది.

ఇప్పుడు ముగ్గురు మెయిటీ వర్గానికి చెందిన వారపై కాల్పులు జరపడంతో కేంద్రమ భద్రతను మరింత పెంచింది. అలాగే మణిపుర్‌లోని కొన్ని మహిళా సంస్థలు భద్రతా బలగాల కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని సీఏపీఎఫ్ తెలిపింది. దీనివల్ల విధి నిర్వహణ కష్టంగా ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా మణిపుర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతోందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు ముగ్గురు మెయిటీ వర్గానికి చెందిన వారపై కాల్పులు జరపడంతో కేంద్రమ భద్రతను మరింత పెంచింది. అలాగే మణిపుర్‌లోని కొన్ని మహిళా సంస్థలు భద్రతా బలగాల కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని సీఏపీఎఫ్ తెలిపింది. దీనివల్ల విధి నిర్వహణ కష్టంగా ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా మణిపుర్ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతోందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.