Leading News Portal in Telugu

Polavaram: పొలవరం ఆలస్యం కావడానికి కారణం ఆ రెండు పార్టీలే.. పురుంధేశ్వరీ కీలక వ్యాఖ్యలు – Telugu News | AP BJP Chief Purundeswari Clarifies why polavaram project is delaying


టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పొలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు. పొలవరం ప్రాజెక్టుకి కేంద్రం అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అధిష్ఠానం పొలవరం ప్రాజెక్టుకు కట్టుబడి ఉందని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పొలవరాన్ని గుర్తించినప్పటి నుంచే కట్టబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ పొలవరం ప్రాజెక్టు అంశంపై మాట్లాడారు. పొలవరం ప్రాజెక్టుకి కేంద్రం అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అధిష్ఠానం పొలవరం ప్రాజెక్టుకు కట్టుబడి ఉందని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పొలవరాన్ని గుర్తించినప్పటి నుంచే కట్టబడి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వడం ఎందుకు ఆలస్యమవుతుందో అనే విషయంపై కూడా ఆమె స్పందించారు. తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్‌సీపీ పార్టీ.. ఈ రెండు ప్రభుత్వాలు చేసిన చర్యల వల్లే పొలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని ఆరోపించారు. అయితే గతంలో ట్రాన్స్‌ట్రాయ్ అనే కంపెనీ పొలవరం ప్రాజెక్టు టెండర్‌ను తమ హస్తగతం చేసుకుందని చెప్పారు. ఒకవేళ ఆ కంపెనీ సరిగ్గా విధులు నిర్వర్తించకపోతే నిబంధనల ప్రకారం ఆ కంపెనీని తొలగించే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ఆ కంపెనీని తొలగించేందుకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వానికి మూడు సంవత్సరాల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు అక్కడ నిర్వాసితులకు సంబంధించిన జాబితా అలాగే.. డిజైన్‌కు సంబంధించిన విషయాలు కేంద్రానికి చెబితే తమ అధిష్ఠానం సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.