శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ఫుల్ రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట దొరికింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1914 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు సైతం 24.23 డాలర్ల మార్క్ దగ్గర అమ్ముడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారక విలువ ఇవాళ రూ. 82.623 మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను ఒకసారి చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, ఇక, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.
దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
1. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,600గా ఉంది.
2. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450గా ఉంది.
3. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 ఉంది, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.
4. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,780గా ఉంది.
5. కోల్కతాలో పది గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450గా ఉంది.
ఇక, దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర రూ. 80వేల దగ్గర కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 కాగా, ముంబైలో రూ. 76,400, చెన్నైలో రూ. 80వేలు, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500 లుగా నమోదైంది.