Leading News Portal in Telugu

GVL Narasimha Rao : ఉత్తరాంధ్రను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది


ఉత్తరాంధ్ర అభివృద్దిపై సమష్యల పరిష్కారం పై కృషిచేస్తున్నామన్నారు రాజ్యసభ సభ్యులు కామెంట్స్ జీవీఎల్‌ నరసింహారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం – వారణాశికి రెగ్యులర్ ట్రైన్ వేయించగలుగుతున్నాం. దసరా నాటికి ట్రై మొదలౌతుందని, ఉత్తరాంధ్రను రాష్ర్ ప్రభుత్వాలు నిర్లక్యం చేస్తున్నాయన్నారు జీవీఎల్‌. అన్ని వనరులు ఉన్నా ఈప్రాంత ప్రజలను పాలకులు వదిలేసారని, ఇక్కడ రాజకీయ పలుకువడిన కలిగిన నేతలు ఉన్నారన్నారు జీవీఎల్‌. ముప్పై నలబై ఏండ్లుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబాలు శ్రీకాకుళం లొ ఉన్నాయని, ధర్మన , అచ్చం నాయుడు కుటుంబాలు జిల్లాను పట్టించుకోలేదని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

అంతేకాకుండా.. శ్రీకూర్మం , అరసవల్లి అభివృద్ది కొసం నేను కృషిచేస్తానని జీవీఎల్‌ వెల్లడించారు. సామాజికంగా తుర్పు కాపులు సోండి , మెదలైన ఐదు కులాలకు ఒబిసి రిజర్వేషన్ కొసం కృషిచేస్తున్నామని, తెలంగాణ విభజన తరువాత 26 కులాలను బిసి జాభితా నుంచి తొలగించిందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. కేసీఅర్ ధోరణి మార్పుకోవాలని ఆయన హితవు పలికారు. లేకుంటే ఉత్తరాంధ్ర నుంచి వెల్లిన 10 లక్షల మంది ప్రజలు బిఆర్ ఎస్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. దేశంలో నగర ఆధారిత అభివృద్దికి కేంధ్రం ముందుకు వెళుతుందని, దక్షిణాధిలో విశాఖపట్టనాన్ని గ్రోత్ హాబ్ గా తిర్చి దిద్దేందుకు కేంధ్రం కృషిచేస్తుందన్నారు జీవీఎల్‌.