Leading News Portal in Telugu

TDP-Janasena: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం.. ఆ అంశాలే ప్రధాన అజెండా


TDP-Janasena: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం.. ఆ అంశాలే ప్రధాన అజెండా

TDP-Janasena: టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రo రూపకల్పన పైనా ప్రధానంగా నేతలు చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి టీడీపీ – జనసేనలు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నాయి. ఓటర్ జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరుకు ప్రణాళికను రచిస్తున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై జేఏసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి లోకేష్ సహా ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా.. ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టీడీపీ పీఏసీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ భావించింది. ఇసుక, మద్యం, కరువు, ధరలు, ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించింది. నియోజకవర్గాల వారీగా టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా జేఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.