- ఏసీబీకి చిక్కిన ఎంఈవో
- రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా కూడేరు ఎంఈవో చంద్రశేఖర్

Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. కూడేరు ఎంఈవో చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి బైపాస్ రోడ్లో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎంఈఓ పట్టుబడ్డాడు. కూడేరు ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గొట్కూరు సమీపంలో ఉన్న వెరీ డైన్ ఎ కాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పై స్టూడెంట్ యూనియన్స్ , మీడియాలో వస్తున్న వాటిపై డీఈవో దృష్టికి వెళ్లకుండా మేనేజ్ చేయడానికి స్కూల్ యాజమాన్యం నుంచి 2 లక్షల రూపాయలను ఎంఈవో డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే పాఠశాల యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పాఠశాలకు చెందిన సాగర్ అనే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ అనంతపురం బైపాస్లోని ఎంజీ పెట్రోల్ బంకు వద్ద ఎంఈవో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.