189వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. జననేత గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది.
రాజన్న బిడ్డను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు, పార్టీనేతలు, తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్ జగన్, భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.