వాళ్లందరికీ పరీక్షలు చేయాలన్న సీఎం జగన్… సర్వేపై ఆరా
రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై సర్వేచేసి వివరాలు నమోదు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రియల్టైం పద్ధతిలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామన్న అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి రెండు సర్వేల్లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలతో గుర్తించినట్టుగా పేర్కొన్న 6,289 మంది కూడా ఈసర్వేలో భాగంగా ఉండాలని జగన్ అధికారులకు తెలిపారు. మెడికల్ ఆఫీసర్ నిర్ధారించిన వారినే కాకుండా … వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు చేయించాలని ముఖ్యమంత్రి అదేశించారు.
ఎక్కడా కూడా తప్పులకు జరగడానికి అవకాశాలు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగాలని అన్నారు. ఇప్పటికే జరిగిన మొదటి, రెండు రాష్ట్రంలోని కుటుంబాల వారీ సర్వేపై సీఎం ఆరా తీశారు. ఉదయం 9 గంటలవరకూ గడచిన 12 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీకాంటాక్టులు వల్లే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలని వివరించారు. వీరి పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ… వాటి కేసుల సంఖ్య తగ్గుతుందన్న సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు.
వ్యవసాయంపై కోవిడ్ –19 ప్రభావం, రైతులకు అండగా తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై వివరాలు అందించిన అధికారులు, వారంరోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు పంటరావడం పెరుగుతుందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్–19 విపత్తు నేపథ్యంలో రవాణా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.ధాన్యం రవాణాకు ఎన్ని ట్రక్కులు కావాలో అంచనా వేసి, ఆమేరకు సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.