హైకోర్టుకు చేరిన ఏపీ ఎస్ఈసీ పంచాయతీ… నెక్ట్స్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించి… ఆ స్థానంలో మరో ఎన్నికల మిషనర్ను ఆఘమేఘాలపై తేవడంతో… విషయాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని రమేష్ కుమార్ డిసైడయ్యారు. తనను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందంటూ రమేశ్ సవాల్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను తొలగిస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్లో అన్నారు. రమేష్ కుమార్ తరపున లాయర్ అశ్వనీకుమర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యగా… హైకోర్టు విచారణకు తీసుకుంది. మరో రెండు పిటిషన్లు కూడా ఇదే మేటర్పై వచ్చాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం మొన్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ని మార్చుతూ శుక్రవారం ఆర్డినెన్స్ పాస్ చేసింది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తేవడం, మార్గదర్శకాలు విడుదల చేయడం, మూడు జీవోలు జారీ చేయడం వంటి పనులన్నీ శుక్రవారం ఫటాఫట్ జరిగాయి. ఆర్డినెన్స్లో చెప్పిన అంశాలపై శుక్రవారం రాత్రి జీవో నెం.617ని ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసిందంటూ జీవో జారీ చేసింది.
శనివారం ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి కనగరాజ్ని నియమించింది. శనివారమే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించేశారు. ఒకప్పుడు కనగరాజ్ మద్రాస్ హైకోర్టులో జడ్జిగా 9 ఏళ్లు పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, ముసలివాళ్ల సంక్షేమం అంశాలపై కనగరాజ్ సంచలన తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది? ప్రభుత్వం చేసింది రైటే అంటుందా లేక… అలా ఎలా చేస్తారు అంటుందా అన్నది తేతాల్సిన విషయం.