ఫోన్లో కరోనా సేవలు.. టెలీ మెడిసిన్ ప్రారంభించిన సీఎం జగన్
ఏపీలో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యనూ పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు 14410ని కేటాయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ పేర్లు నమోదు చేశారు. డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి.