Leading News Portal in Telugu

రమేశ్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్

ఏపీ మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ పిటిషన్‌పై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రమేశ్ కుమార్ పిటిషన్‌పై తప్పుడు అభియోగాలున్నాయని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. తనను తొలగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారనే విషయాన్ని ఖండిస్తున్నామని వివరించింది. ఎస్ఈసీ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉందన్న ఏపీ ప్రభుత్వం…గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తెచ్చామని వెల్లడించింది. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకే ఆర్డినెన్స్ తీసుకువచ్చామని తెలిపింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ హోదాలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తమను సంప్రదించలేదని ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. కరోనా విషయంలోనూ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించలేదని వివరించింది. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసిన పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు.