ఏపీలో కొత్తగా 75 కేసులు.. 92 మంది డిశ్చార్జి..
ఏపీలో కేవలం 24 గంటల్లో కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరులోనే 25 కేసులు నమోదు కాగా, అనంతపూర్లో 4, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, కృష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరుకుంది. అటు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 20 మంది మృతిచెందగా, ప్రస్తుతం 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా అనంతపూర్లో 28, చిత్తూరులో 49, తూర్పు గోదావరిలో 18, గుంటూరులో 130, కడపలో 21, కృష్ణాలో 60, కర్నూలులో 168, నెల్లూరులో 65, ప్రకాశంలో 42, విశాఖపట్నంలో 3, పశ్చిమ గోదావరిలో 26 కేసులు నమోదు కాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా ఫ్రీగా ఉన్నాయి. ఆ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శుభ పరిణామం.
గత 24 గంటల్లో 3775 శాంపిల్స్ను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 75 మందికి పాజిటివ్గా వచ్చిందని పేర్కొంది. అయితే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా రాగా, అతడికి నెల్లూరులో చికిత్స జరుగుతోంది. అందువల్ల ఆ కేసును నెల్లూరు కేసుల్లో చేర్చినట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.