Leading News Portal in Telugu

జగన్‌పై షర్మిల ప్రశంసలు… ఆయనతో పోల్చుతూ…

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల ప్రశంసలు కురిపించారు. నేడు పేద విద్యార్థుల కోసం జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్… ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధులను విడుదల చేశారు. దీనిపై స్పందించిన షర్మిల… పేదలకు మేలు చేయడానికి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే… తాను రెండు అడుగులు ముందుకేస్తానని తన అన్న వైఎస్ జగన్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్ నిలిచారని జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రస్తావించారు. తన అన్న ప్రారంభించిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని షర్మిల ట్వీట్ చేశారు.