Leading News Portal in Telugu

Gold Today Price: వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?


Gold Today Price Today in Hyderabad on 24th August 2023: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,230గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,400గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,660లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,630 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230గా కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 75,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,300గా ఉండగా.. చెన్నైలో రూ. 78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,500 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,500ల వద్ద కొనసాగుతోంది.