Leading News Portal in Telugu

Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! మరోసారి 60 వేలకు చేరువలో


Gold Price Today in Hyderabad 25th August 2023: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు నేడు కూడా అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,830లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,450గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,230 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర శుక్రవారం రూ. 76,900లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1600 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,900గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.