Leading News Portal in Telugu

Today Gold Price: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంతుందంటే?


Gold Price Today in Hyderabad on 21st September 2023: గత 4-5 రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై మాత్రం రూ. 10 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,230గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,370గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,230గా కొనసాగుతోంది.

నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో గురువారం కిలో వెండి ధర రూ. 74,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,500గా ఉండగా.. చెన్నైలో రూ. 78,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,250 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 78,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000ల వద్ద కొనసాగుతోంది.