Leading News Portal in Telugu

Video: ఫోన్ ఎంతపని చేసింది.. కాల్ మాట్లాడుతూ ట్రైన్ ను ఫ్లాట్ ఫాం పైకి ఎక్కించాడు



New Project (9)

Video: మథురలో జరిగిన రైలు ఘటనకు సంబంధించిన సంయుక్త దర్యాప్తు నివేదిక వెల్లడైంది. రైలు నడుపుతున్నప్పుడు లోకో ఫైలట్ తన మొబైల్ ఫోన్‌లో ఏదో చూస్తున్నాడని తేలింది. అతను తేలికపాటి మత్తులో ఉన్నాడని దర్యాప్తు నివేదికలో కూడా చెప్పబడింది. అయితే విచారణ నివేదిక మాత్రం ఇంకా బయటకు రాలేదు. వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఫైలట్ పొరపాటు కారణంగా రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కింది. ‘క్రూ వాయిస్ అండ్ వీడియో రికార్డింగ్ సిస్టమ్’ ద్వారా పొరపాటు బయటపడిందని వర్గాలు తెలిపాయి. రైలు వచ్చిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారని అందులో పేర్కొన్నారు. దీని తర్వాత రైలు కార్మికుడు సచిన్ తన మొబైల్ ఫోన్‌లో ఏదో చూస్తుండగా రైలు డిటిసి క్యాబ్ (ఇంజిన్) వద్దకు చేరుకున్నాడు. అతను క్యాజువల్‌గా తన బ్యాగ్‌ని ఇంజిన్ థ్రెటల్‌పై ఉంచి తన మొబైల్ ఫోన్‌లో ఏదో చూడటం ప్రారంభించాడు. బ్యాగ్ ఒత్తిడికి థొరెటల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలి ప్లాట్ ఫాం పైకి ఎక్కింది.

Read Also:Ismart Shankar 2: డబుల్ ఇస్మార్ట్-సంజూ బాబా-పూరి… కాంబినేషన్ అదిరింది

అది (రైలు) ప్లాట్‌ఫారమ్ చివరను విరిచిందని, కోచ్‌లో సగం ప్లాట్‌ఫారమ్ నంబర్ టూ పై భాగంలోకి వెళ్లిందని ఫలితంగా OHE (ఓవర్‌హెడ్ వైర్) కూడా ప్రభావితమైందని నివేదిక పేర్కొంది. సచిన్‌కు నిర్వహించిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో అతడు తేలికపాటి మత్తులో ఉన్నట్లు తేలిందని నివేదికలో పేర్కొంది. అతనిని వైద్య పరీక్షల కోసం పంపామని అక్కడ మద్యం సేవించిన ఖచ్చితమైన స్థాయిని తెలుసుకోవడానికి అతని రక్త నమూనాను తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి సచిన్ సహా ఐదుగురిని డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్‌ప్రకాష్ అగర్వాల్ సస్పెండ్ చేశారు. ఆ నలుగురిలో హర్భజన్ సింగ్, బ్రజేష్ కుమార్, కుల్జీత్ సాంకేతిక సిబ్బంది కాగా గోవింద్ హరి శర్మ లోకో పైలట్.

Read Also:North Korea: తగ్గేదేలే.. అమెరికాను మళ్లీ రెచ్చగొడుతున్న కిమ్

ఐదుగురిని సస్పెండ్ చేశామని కేసు దర్యాప్తు చేస్తున్నామని అగర్వాల్ తెలిపారు. సాధారణంగా డిటిసి క్యాబ్ (ఇంజిన్) కీలను టెక్నీషియన్ తీసుకుంటారని, అయితే ఈ సందర్భంలో టెక్నీషియన్ కీలను సేకరించడానికి సచిన్‌ను పంపారని ఉమ్మడి నివేదిక పేర్కొంది. ఘటనకు సంబంధించిన సంక్షిప్త వివరాలను తెలియజేస్తూ రైలు రాత్రి 10.49 గంటలకు మధుర స్టేషన్‌కు చేరుకుందని నివేదిక పేర్కొంది. లోకో పైలట్ తన డ్యూటీ ముగించుకుని క్యాబ్ నుండి బయటకు రాగానే, సచిన్ కీస్ తీసుకునేందుకు క్యాబ్‌లోకి ప్రవేశించాడు. అతను క్యాబ్‌లోకి ప్రవేశించిన నిమిషాల్లో అది కదలడం ప్రారంభించింది. అందులో సగం ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కింది.