Leading News Portal in Telugu

Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. తులంపై ఎంత పెరిగిందంటే?


Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. తులంపై ఎంత పెరిగిందంటే?

Gold Price Today in Hyderabad on 29th October 2023: ఇటీవల తగ్గినట్టే కనిపించిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ. 600లు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 600 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్‌, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,440 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,620గా కొనసాగుతోంది.

మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 74,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 74,600లు ఉండగా.. చెన్నైలో రూ. 77,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 77,500గా కొనసాగుతోంది.