Leading News Portal in Telugu

Bussiness Idea : అదిరిపోయే బిజినెస్.. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ..



Matti Kappulu

ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా వ్యాపారాలు చేస్తున్నారు.. అంతేందుకు సినిమా హీరో, హీరోయిన్లు కూడా సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు.. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ చేస్తే ఎప్పుడూ లాభాలు వచ్చేలా ఉండాలి.. అప్పుడే అధిక లాభాలను పొందుతూన్నారు..ఆ వ్యాపారం చేసే ప్లేస్‌, మీరు ఉత్పత్తి చేసే ప్రొడెక్ట్స్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ ఇవన్నీ కూడా కీ రోల్‌ ప్లే చేస్తాయి. మీ దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నా డిమాండ్‌ ఎక్కువగా ఉన్న వ్యాపారం చేయడం వల్ల లాభాలను పొందవచ్చు. కేవలం ఐదు వేల పెట్టుబడితే చేయదగ్గ సూపర్‌ బిజినెస్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆ బిజినెస్ మారేంటో కాదు మట్టి కప్పుల తయారీ.. ఈరోజుల్లో చాలా మంది వంటగదుల్లో మళ్లీ మట్టిపాత్రలు దర్శనమిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అల్యూమినియం, స్టీల్‌, నాన్‌స్టిక్‌ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివి కావని జనాలు మెల్లగా తెలుుకుంటున్నారు. మొత్తంగా కాకపోయినా.. కొన్ని డిష్‌లను మట్టిపాత్రలతో రీప్లేస్‌ చేస్తున్నారు. ముఖ్యంగా టీ, కాఫీ తాగేందుకు కప్పులు, పెనంలు, పెరుగు తయారుచేసేపాత్రలు ఇలాంటి వాటి కోసం మట్టి పాత్రలనే వాడుతున్నారు.. వీటిని తయారీచేసి మంచి లాభాలను పొందవచ్చు..

ఈ వ్యాపార ప్రారంభానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. కేవలం రూ.5,000 కనీస మూలధన పెట్టుబడితో చిన్న స్థలంతో ప్రారంభించవచ్చు..కుమ్హర్ సశక్తికరణ్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ వ్యాపారం చెయ్యాలని అనుకొనేవారికి ప్రభుత్వం సహకారం కూడా అందిస్తుంది.. టీ మట్టి కప్పులు వంద యూనిట్స్ కేవలం రూ.50కే లభిస్తున్నాయి. లస్సీ కుల్హాడ్స్, మిల్క్ కుల్హాడ్స్ వంద యూనిట్లకు రూ.150కు లభిస్తున్నాయి..రోజుకు 500 చొప్పున టీ, లస్సీ మట్టి కప్పులను అమ్మడం ద్వారా రూ.1000 ఆదాయం పొందవచ్చు. అయితే వీటి డిమాండ్ అధికంగా ఉండే రెస్టారెంట్, టీ షాప్‌లతో ఒప్పందం కుదర్చుకుంటే రోజువారీ సంపాదన రూ. 5,000 నుంచి రూ.7,000 వరకు రావచ్చు.. అయితే కాస్త కష్ట పడాలి కూడా..