Leading News Portal in Telugu

Budget 2024 : ప్రకృతి వ్యవసాయంపై దృష్టి, ఉత్పాదకతను పెంచేలా బడ్జెట్


Budget 2024 : ప్రకృతి వ్యవసాయంపై దృష్టి, ఉత్పాదకతను పెంచేలా బడ్జెట్

Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ రంగంపై దృష్టి సారించడం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. వ్యవసాయంలో పరిశోధనలను మార్చడం, నిపుణులను పర్యవేక్షించడం, వాతావరణానికి అనుగుణంగా కొత్త వంగడాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. దీనితో పాటు వచ్చే ఏడాదిలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయంలో చేరనున్నారు. పప్పుధాన్యాలు, చమురు ఉత్పత్తిలో స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకోసం ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ వంటి పంటల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.

ఈ ప్రత్యేక అంశాలపై శ్రద్ధ
* పప్పుధాన్యాల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలిపారు. రొయ్యల పెంపకం మరియు మార్కెటింగ్ కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది.
* వాతావరణ ప్రభావం తక్కువగా ఉండే పంటల రకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇందులో 109 రకాల 32 పంటలను తీసుకురానున్నారు.
* ఐదు రాష్ట్రాల్లో సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో పేర్కొన్నారు.
* కూరగాయల ఉత్పత్తిని పెంచేందుకు క్లస్టర్ పథకాన్ని ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు.
* సహజ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, వచ్చే ఏడాదిలో కోటి మంది రైతులు చేరుతారన్నారు. ఇది మెరుగైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
* సహజ వ్యవసాయం నేల ఆరోగ్యం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడమే కాదు. అంతే కాకుండా రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది.