Leading News Portal in Telugu

Gold Rate: తులం బంగారం ధర త్వరలో రూ. 50 వేలు…మళ్లీ తగ్గేది ఎప్పుడంటే…

దేశీయంగా బంగారం ధరలు చుక్కలను తాకాయి. మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 2 వేల మేర పెరిగి రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 45,724 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. . కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో పసిడి ధర రూ.45 వేలను అధిగమించిందని ఆర్థిక నిపుణుల అంచనా. అయితే అతి త్వరలోనే బంగారం ధర దేశీయ మార్కెట్లలో రూ.50 వేలు వైపు వెళ్లడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చునని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ మార్కెట్లలో ఈక్విటీ నిధులను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు తరలిస్తున్నారు. అయితే బులియన్ మార్కెట్ నూతన గరిష్టాలకు చేరుకున్న తర్వాత లాభాల స్వీకరణ కోసం అంతర్జాతీయ మార్కెట్లలోకి యూరప్ సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం విక్రయించే వీలుంది. అయితే గతంలో సైప్రస్ సంక్షోభం సమయంలోనే ఇదే జరిగింది.

ప్రపంచ మార్కెట్లలో కూడా పసిడి పరుగు కొనసాగుతోంది. కోవిడ్‌-19 బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనల మధ్య అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరిగింది. సోమవారం ఒక్కరోజే 2 శాతం పెరిగి ఔన్స్‌ బంగారం 1700 డాలర్లకు చేరింది. శుక్రవారంతో పోలిస్తే ఔన్స్‌ బంగారం 20 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,714.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది