Leading News Portal in Telugu

ఆ సంస్థలకు కరోనా బాగా కలిసి వచ్చింది…400 శాతం సేల్స్ జూమ్…

ప్రముఖ ఆయుర్వేద బ్రాండ్‌ పతంజలి చవన్‌ప్రాశ్‌ విక్రయాలు కేవలం ఒక్క నెలలోనే 400 శాతం పెరిగాయి. మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్యకాలంలో చవన్ ప్రాశ్ విక్రయాలు భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో శరీరంలో ఇమ్యూనిటీ పెంచే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సేల్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఇందులో భాగంగా చవన్‌ప్రాశ్‌లో ఇమ్యూనిటీ గుణాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో జనం చవన్‌ ప్రాశ్‌ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. చవన్ ప్రాశ్ లో ఉసిరి వాడకం వల్ల సీ విటమిన్‌ పుష్కలంగా ఉండడంతో చవన్‌ప్రాశ్‌ తిన్నవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని చాలా ఏళ్లుగా ప్రజల్లో నమ్మకం ఉంది. తాజా పరిస్థితుల దృష్ట్యా దేశంలో చవన్‌ప్రాశ్‌ కు డిమాండ్‌ పెరిగింది. అయితే చవన్ ప్రాశ్ మార్కెట్ లో డాబర్ దే సింహభాగం. దేశవ్యాప్తంగా డాబర్‌ చవన్‌ప్రాశ్‌ మంచి బ్రాండ్‌ విలువ ఉంది. అంతేగాకుండా మార్కెట్‌లో 60 శాతం వాటాను డాబర్‌ కలిగి ఉంది. ఆ తరువాతి స్థానంలో ఇమామీ, బైధ్యనాథ్,పంతంజలీ వంటి ఆయుర్వేద బ్రాడ్‌లు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఒక్కసారిగా చవన్‌ప్రాశ్‌ సరఫరాకు ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ప్రస్తుతం అడ్డంకులు నెమ్మదిగి తొలగుతున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.